సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024కు రంగం సిద్ధం.. 23 నుంచి మ్యాచులు షురూ

-

ఇన్నాళ్లు సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన హీరోలు ఇప్పుడు బ్యాట్​ పట్టి మైదానంలో తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. అదేనంటి సినీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024తో ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా సీసీఎల్ పదో సీజన్ ప్రోమోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సీజన్ గ్రాండ్​గా మొదలు కానుంది.

మొత్తం 8 భాషలకు చెందిన 200 మందికి పైగా సినీ తారలు ఈ లీగ్ లో పాల్గొంటున్నారు. 8 జట్లుగా విడిపోయి క్రికెట్‌తో ప్రేక్షకుల్ని ఎంటర్​టైన్​ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో లాంఛ్ వేడుక దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా వేదికగా గ్రాండ్​గా జరిగింది. పలువురు సినీ తారలు ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరిలో నటులు, జట్ల కెప్టెన్లు కిచ్చా సుదీప్‌, సోహైల్‌ ఖాన్‌, జీవా, ఆర్య, సుధీర్‌ బాబు, తమన్‌, బన్ను థిల్లాన్‌, జిస్సుసేన్‌ గుప్తా, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సోనూ సూద్‌, ఉన్ని ముకుందన్‌ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version