ఛార్మీని ముద్దు పెట్టుకున్న దర్శకుడు!

-

సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నటీనటులు, దర్శకులు, నిర్మాతల మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉంటుంది. కొన్ని బంధాలు జయాపజయాలకు అతీతంగా నిలుస్తాయి. వారి స్నేహం చిరకాలంగా నిలుస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి ఓ స్నేహబంధం గురించి ప్రముఖ హీరోయిన్, నిర్మాత ఛార్మీ చెప్పుకొచ్చింది.

 

నీ తోడు కావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఛార్మీ అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించింది. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలందరి సరసన నటించింది. స్టార్ స్టేటస్ అనుభవించిన చార్మీ.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అయితే కాలం ముందుకు సాగుతున్న కొద్దీ ఛార్మీకి అవకాశాలు సన్నగిల్లాయి. పూర్తిగా మార్కెట్ డౌన్ కావడంతో నిర్మాతగా సెటిలైంది. పూరీ జగన్నాథ్‌తో కలిసి నిర్మాణంలో భాగస్వామిగా కొనసాగుతోంది.

ప్రస్తుతం ఛార్మీ, దర్శకుడు జయంత్ సీ పరాన్జీతో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. పదహారేళ్ల స్నేహబంధం ఇంకా కొసాగాలి అంటూ ఛార్మీ షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరు కలిసి అల్లరి పిడుగు చిత్రానికి పని చేశారు. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. ఇక ఈ ఫోటోలను చూస్తుంటే అందరూ కలిసి తెగ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news