బ్రేకింగ్ : సీఎం కెసిఆర్ తో చిరంజీవి, నాగార్జునలు భేటీ

-

హైదరాబాద్ లో వరదలు సృష్టించిన బీభత్సం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వరదల నేపథ్యంలో చాలా మంది టాలీవుడ్ నటీనటులు ప్రభుత్వానికి తమ విరాళం ప్రకటించారు. అయితే తాజాగా ఈ రోజు ఈ విషయం మీద సీఎం కేసీఆర్ తో టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి నాగార్జున భేటీ అయినట్లు తెలుస్తోంది. వరదల నేపధ్యంలో నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, చిరంజీవి, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు.

అప్పుడు నాగార్జున 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇస్తానని తెలిపారు. చిరంజీవి కోటి రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే వారు సీఎంని కలిసినట్టు చెబుతున్నారు. చెక్ లు అందచేసేందుకే కలిసినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వస్తే కానీ ఎందుకు కలిశారు అనేది చెప్పలేం.

Read more RELATED
Recommended to you

Exit mobile version