బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

-

సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇందులో హీరోయిన్ గా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాలో నటించిన నటీనటుల డీటెయిల్స్ ను ప్రస్తుతం అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమాలో సాయి ధరంతేజ్ రెండో చెల్లిగా నటించిన అమ్మాయికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇద్దరు హీరోయిన్లు నటించినప్పటికీ కూడా సాయి ధరంతేజ్ రెండో చెల్లెలుగా నటించిన అమ్మాయి నటన చాలా బాగుండడంతో అమ్మాయి ఎవరా అని నెటిజన్స్ సైతం వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె బ్యాక్గ్రౌండ్ తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకెళితే తమిళంలో ఈమె ఒక స్టార్ హీరోయిన్ ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. అసలు పేరు యువ శ్రీలక్ష్మి. అక్కడ హీరోయిన్ గా భారీ పాపులారిటీ దక్కించుకుంది కాబట్టి ఈమెకు ఈ సినిమాలో సముద్రఖని ఏరి కోరి మరీ అవకాశం ఇచ్చారు.

ఈమె నటన ఈ సినిమాలో చాలా బాగుండడంతో తెలుగులో ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం. తమిళంలో ఉన్న ఎంతోమంది టాలెంటెడ్ నటీనటులను తెలుగులో కొంతమంది దర్శకులు పరిచయం చేస్తూ వారికి ఉన్నత జీవితాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన యువ శ్రీ లక్ష్మి తమిళ్ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా తెలుగులో కూడా సక్సెస్ సాధించాలన్న కోరికతోనే డైరెక్టర్ సముద్రఖని ఇలా ఆమెకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news