రంగస్థలం మూవీలో ఆది లవర్ ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా ..?

-

సుకుమార్ దర్శకత్వంలో గ్లోబల్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం రంగస్థలం.. 1980 ల నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2018 మార్చి 30న విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవిశంకర్ ,సివి మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో రామ్ చరణ్ సరసన సమంత నటించగా..ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ,అనసూయ కీలక పాత్రలు పోషించారు. ఇక ఇందులో నటించిన ప్రతి పాత్రకి కూడా పూర్తిస్థాయిలో భారీ పాపులారిటీ లభించింది అని చెప్పాలి.

సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా భారీగా వసూలు రాబట్టి రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ సినీ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాలో ఆది పినిశెట్టి కి ప్రేయసిగా నటించిన అమ్మాయి ఎవరో గుర్తుందా..? తాను కనిపించింది తక్కువ సమయమే కానీ తన ప్రేమ కథ చుట్టూనే చిట్టిబాబు కథ మలుపు తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రేయసిగా కనిపించిన అమ్మాయి ఎవరో కాదు పూజిత పొన్నాడ.

ఈ సినిమా హిట్ కావడంతో బాగానే ఆఫర్లు అందుకుంది అలా వేర్ ఇస్ వెంకటలక్ష్మి, బ్రాండ్ బాబు ,7 వంటి చిత్రాలలో నటించిన ఈమె తెలుగమ్మాయి.. ఏపీలోని విశాఖపట్నం కి చెందిన అమ్మాయి.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన పూజిత టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం కూడా చేసింది. నటన పైన ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆ తర్వాత 2016లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు రావణాసుర సినిమాలో కూడా నటించిన ఈమె పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోందని సమాచారం .మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఈమె చేతిలో ఉన్నాయట..

Read more RELATED
Recommended to you

Exit mobile version