Adhipurush : థియేటర్లలో ఆకట్టుకుంటున్న హనుమాన్ సీటు..పోటోలు వైరల్

-

ప్రభాస్ మొదటిసారి బాలీవుడ్ డైరెక్టర్ తో తెరకెక్కించిన చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్ పైన తెరకెక్కించడం జరిగింది.దాదాపుగా రూ .500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.

దాదాపుగా ఎన్నోసార్లు ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు రకాల కారణాల చేత పోస్ట్ పోన్ అవుతూ ఉండేది. ముఖ్యంగా టీజర్ తో విమర్శలు రావడంతో మళ్లీ VFX మళ్లీ రూ.100 కోట్లు కేటాయించి రీ షూట్ చేయడం జరిగింది. అయితే, ఎట్టకేలకు ఈ సినిమా ఇవాళ రిలీజ్‌ అయింది. అయితే, ఆది పురుష్ సినిమా ప్రదర్శన థియేటర్లలో… హనుమాన్ కు కేటాయించిన సీట్లు ఆకట్టుకుంటున్నాయి. ప్రతి థియేటర్ లో ఒక సీటును ఆంజనేయులుకి కేటాయించడంతో భక్తులు ఆ సీటును అలంకరించారు. కొంతమంది మాత్రం.. హనుమాన్ ఫోటోలు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. దీంతో థియేటర్ లో భక్తి భావం కలుగుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news