మామిడి తోటలో భర్తతో కలిసి.. ‘మిర్చి’ సీన్ రీక్రియేట్ చేసిన అనసూయ

-

జబర్దస్ షోతో యాంకర్​గా అడుగుపెట్టి.. ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఓవైపు షూటింగులతో బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి మాత్రం పక్కాగా తను టైం కేటాయిస్తుంది. ఇక సమ్మర్ వెకేషన్​లో జాలీగా ఎంజాయ్ చేస్తోంది అనసూయ. తాజాగా తన భర్త సుశాంత్ భరద్వాజ్​తో కలిసి ఫామ్​హౌజ్​కు వెళ్లింది. అక్కడి తోటల్లో తిరుగుతూ సందడి చేసింది.

తాజాగా అనసూయ తన భర్తతో కలిసి వాళ్ల మామిడి తోటలో సందడి చేసింది. మామిడి కాయలు తెంపుతూ కనిపించింది. ఈ సందర్భంగా భర్తతో రొమాంటిక్​గా ఫోజులిచ్చింది. తన భర్త ఎత్తుకోగా మామిడి కాయలు కోస్తూ ఆకట్టుకుంది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు మిర్చిలో ప్రభాస్ – అనుష్క సీన్​ను రిపీట్ చేశారుగా అని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. మరికొందరు మామిడి కాయలు తింటున్న అనసూయను.. చూసి మళ్లీ ప్రెగ్నెంట్ ఏమోనని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news