ప్రముఖ సీనియర్ నటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం “థగ్ లైఫ్”. ఈ సినిమాను జూన్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా తాను కొన్ని సంచలన కామెంట్లు చేశారు. ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా తను కన్నడ భాషపై మాట్లాడిన మాటలను సమర్ధించుకుంటున్నారు. తానేమి తప్పు మాట్లాడటం లేదని అన్నారు.

క్షమాపణ చెప్పేది లేదని కూడా స్పష్టం చేశారు. కాగా, ఈ సినిమా విడుదలకు ఆటకం లేకుండా చూడాలని ఆయన కర్ణాటక హైకోర్టులో ఆశ్రయించగా…. కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీంతో కమల్ హాసన్ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాశారు. మనమందరం కూడా ఒక్కటని చెప్పడమే నా ఉద్దేశమని అన్నారు. ఈ వివాదంలోకి శివరాజ్ కుమార్ ను లాగడం చాలా బాధాకరం. నాకు అన్ని భాషలపైన చాలా గౌరవం ఉంది. కన్నడ భాషను కూడా నేను ఆరాధిస్తానని కమల్ లేఖ రూపంలో వెల్లడించారు. ఈ విషయంపై కమల్ కోర్టును ఆశ్రయించగా కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ఒక్క క్షమాపణ చెబితే సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదని, క్షమాపణలు చెబితే సమస్య పరిష్కారమయ్యేదని జడ్జి వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.