టాలీవుడ్ యాంకర్ కు కీలక పదవి ఇచ్చిన జగన్!

-

key post in ycp for Anchor Shyamala: టాలీవుడ్‌ యాంకర్ శ్యామల గురించి తెలియని వారుండరు. ఇండస్ట్రీలో రాణించడమే కాకుండా.. ఇటు రాజకీయాల్లోనూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న యాంకర్ శ్యామలకు తాజాగా కీలక పదవి వచ్చింది. వైసీపీ చీఫ్ జగన్ రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలను యాంకర్ శ్యామలకు అప్పగించారు.

key post in ycp for Anchor Shyamala

శ్యామలను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించాడు. శ్యామలతో పాటుగా జూపూడి ప్రభాకర్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజాను అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ వైసీపీ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజరి కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version