కులం పేరుతో దూషించాడని ఓ వ్యక్తి ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపే క్రమంలో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని పట్టణ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. గోదావరిఖని పట్టణంలో నివసిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఎవరో కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని, సదరు వ్యక్తిని శిక్షించాలని ఆ వ్యక్తి గాంధీనగర్లోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపే క్రమంలో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. ఆ టైంలో చంద్రశేఖర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. గాయాలపాలైన అతన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తనను కులం పేరుతో దూషించారని వాటర్ ట్యాంక్ ఎక్కి చంద్రశేఖర్ అనే వ్యక్తి నిరసన.
మద్యం మత్తులోనే వాటర్ ట్యాంక్ ఎక్కిన చంద్రశేఖర్.
బ్యాలెన్స్ మిస్ కావడంతో కిందపడిపోయిన చంద్రశేఖర్.
తీవ్ర గాయాలు కావడంతో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. pic.twitter.com/Oht2Ks9UQ9— ChotaNews App (@ChotaNewsApp) March 3, 2025