‘ఖుషి’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్‌..ఇక ఫ్యాన్స్‌ కు పండగే

-

శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, సమంత జోడిగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా నుంచి రెండో పాట ప్రోమోను రేపు విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘ఆరాధ్య’ అంటూ సాగే ఈ పూర్తి పాటను బుధవారం రిలీజ్ చేస్తా మని తెలిపారు.

ఈ మూవీ నుంచి వచ్చిన ‘నా రోజా నువ్వే’ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా… తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. కాగా ‘ఖుషి’ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా… మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news