కాలినడకన తిరుమల చేరుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ.. వీడియో వైరల్

-

తిరుమల కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. కుటుంబ సభ్యులతో స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తుంటారు. ఇంకా కొందరు ముందుగా మొక్కుకున్నట్లుగా మెట్ల మార్గంలో నడిచి వేంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుంటారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా అలిపిరి నడక మార్గంలో నడిచి తిరుమలేశుడికి మొక్కులు చెల్లించుకుంటారు.

తాజాగా శ్రీవారిని దర్శించుకునేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కుటుంబ సభ్యులు వచ్చారు. తిరుమలకు చేరుకున్న మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార, ఇతర బంధువులతో.. అలిపిరి నడక మార్గాన తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించారు. గురువారం ఉదయం శ్రీవారిని వారు దర్శించుకున్నారు. కాలినడకన వచ్చే భక్తులు మహేశ్‌ బాబు ఫ్యామిలీతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గౌతమ్ను చూసి చాలా మంది మహేశ్ బాబులా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version