నీరజ్‌ చోప్రాతో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన మను బాకర్‌

-

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్కు రెండు కాంస్య పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను బాకర్, ఒక రజతాన్ని అందించిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ప్రేమలో ఉన్నారంటూ నాలుగు రోజుల నుంచి నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పుకార్లు మొదలయ్యాయి. అయితే దీనిపై మను బాకర్ తండ్రి రామ్ కిషన్ బాకర్ స్పందిస్తూ మనుకు ఇంకా పెళ్లీడు రాలేదని.. ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా ఇదే విషయంపై మను బాకర్ కూడా స్పందించింది.

తాను కూడా ఈ రూమర్స్ విన్నట్లు చెప్పింది మను. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. తాను నీరజ్తో క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు ఎవరో వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారని తెలిపింది. తమ మధ్య అంతగా ఇంటరాక్షన్‌ కూడా లేదని.. పోటీలు, ఈవెంట్లలో ఎదురుపడినప్పుడు సరదాగా పలకరించుకుంటామని చెప్పుకొచ్చింది. అంతేకానీ నీరజ్తో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ అవాస్తవమని కుండ బద్ధలు కొట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version