ఓటీటీలోకి ‘మామా మశ్చీంద్ర’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

-

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అయితే ఈయన మూస ధోరణిలో వెళ్లకుండా.. తన ప్రతి సినిమా కాస్త డిఫరెంట్​గా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇటీవల ఆయన మామా మశ్చీంద్ర అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. ఈ నెల 6న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

ఈ నెల 20వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఆ సంస్థ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. నటుడు హర్ష వర్ధన్‌ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రమిది. సుధీర్‌ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. అజయ్‌, అలీ రెజా, రాజీవ్‌ కనకాల, హరితేజ, మిర్చి కిరణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

స్టోరీ ఏంటంటే.. క్రూరుడైన తండ్రి వ‌ల్ల చిన్న‌ప్పుడే త‌ల్లిని కోల్పోతాడు ప‌ర‌శురామ్ (సుధీర్‌ బాబు). త‌నకి ద‌క్కాల్సిన ఆస్తుల్ని మేన‌మామ (అజ‌య్‌) లాగేసుకోవ‌డంతో ఎలాగైనా ఆ ఆస్తిని తిరిగి రాబ‌ట్టుకోవాల‌ని ప‌థ‌కం ర‌చిస్తాడు. మామ‌కు కూతురుతో స‌మానమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుకున్న‌ట్టే ఆస్తిని తిరిగి సొంతం చేసుకుంటాడు. ఆ త‌ర్వాత ప‌ర‌శురామ్ భార్య ఓ పాప‌కి జ‌న్మినిచ్చి చ‌నిపోతుంది. త‌న మామ పేరిట ఉన్న ఆస్తుల‌న్నింటినీ అమ్మేసుకుని కూతురుతో స‌హా వెళ్లి పారిస్‌లో స్థిర‌ప‌డిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు ప‌ర‌శురామ్‌. ఆ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గానే అత‌నిపై హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంది. ఇంత‌కీ ప‌ర‌శురామ్‌ని హ‌త్య చేయాల‌నుకున్న‌దెవ‌రు? త‌న రూపురేఖ‌ల‌తోనే ఉన్న క‌వ‌ల‌లు డీజే, దుర్గ (సుధీర్‌)లకి ఈ హ‌త్య‌తో సంబంధం ఏమైనా ఉందా? వాళ్లిద్ద‌రినీ హ‌త్య చేయాల‌ని ప‌ర‌శురామ్ ముందే ఎందుకు ప్లాన్ చేశాడు?వైర‌ల్ విశాలాక్షి (ఈషా రెబ్బా), మీనాక్షి (మృణాళిని ర‌వి)ల్లో ప‌ర‌శురామ్ కూతురు ఎవ‌రు? అన్నది మిగతా కథ.

Read more RELATED
Recommended to you

Latest news