Manchu Lakshmi : ఘాటు పోజులతో హీటెక్కిస్తున్న మంచు లక్ష్మి

-

మంచు లక్ష్మి.. టాలీవుడ్లో ఈ పేరు తెలియని వారుండరు. నటిగా, యాంకర్గా, నిర్మాతగా ఇలా అన్ని రంగాల్లో తన సత్తా చాటుతోంది. మోహన్ బాబు తనయగా ఇండస్ట్రీకి పరిచయమైనా తన టాలెంట్తో డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తూ తన హవా సాగిస్తోంది. అయితే తాజాగా ఈ భామ ముంబయికి తన మకాం మార్చింది. అప్పటి నుంచి వేషధారణలో కాస్త మార్పొచ్చింది. తరచూ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట ఆ ఫొటోలను షేర్ చేస్తోంది.

తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ ఔట్ఫిట్లో ఘాటు పోజులతో ఈ బ్యూటీ హీటెక్కించింది. క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరైతే ముంబయికి వెళ్లాక మంచు లక్ష్మి చాలా మారిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో తనకు నచ్చినట్లు ఉండటంలో తప్పేంటంటూ ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. మొత్తానికి నెట్టింట మంచు లక్ష్మి ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version