చెక్ బౌన్స్ వార్తలను ఖండించిన మోహన్ బాబు..!

-

నటుడు, నిర్మాత మోహన్ బాబుని చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష పడుతుందన్న వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోహన్ బాబుకి శిక్ష ఏంటని రాజకీయ, సిని పరిశ్రమ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది. దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరికి ఇవ్వాల్సిన 48 లక్షలను చెక్ రూపంలో అందించగా అది బౌన్స్ అయ్యిందని.. 2010 నుండి ఆ కేసు నడుస్తుండగా ఫైనల్ గా ఈరోజు తీర్పు వచ్చిందని ఒక్కసారి వార్తలు ఊపందుకున్నాయి.

అయితే తనపై వచ్చిన ఈ వార్తలను ఖండించారు మోహన్ బాబు. కొన్ని ఛానెళ్లు తన మీద తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్టు తెలుసుకున్నాను.. అలాంటిదేమి జరుగలేదు. నేను ప్రసుతం హైదరబాద్ లో ఇంట్లో ఉన్నానని అన్నారు మోహన్ బాబు. మోహన్ బాబు చెక్ బౌన్స్ కేసు విషయంపై తీర్పు గురించి తెలుసుకుని కంగారు పడిన మచు ఫ్యాన్స్ ఇదంతా ఫేక్ న్యూస్ అని తెలియడంతో హమ్మయ్య అనుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version