మంచు విష్ణు నటించిన తాజా చిత్రం “భైరవం”. ఈ సినిమా రెండు రోజుల క్రితం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మంచు విష్ణు పాల్గొన్నారు. ఆ సమయంలో మనోజ్ సరదాగా మాట్లాడారు. దీంతో మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ చోరీ విషయంపై మనోజ్ మాట్లాడారు. ఈ విషయం పైన ఓ జర్నలిస్టు మంచు మనోజ్ ను ప్రశ్నించాడు. హార్డ్ డిస్క్ మీకే ఇచ్చాను కదా అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

ఆ తర్వాత కాసేపటికి సీరియస్ గా మాట్లాడుతూ మనోజ్ “నేను గతంలో సినిమాపై ఫన్ చేశాను. ఒక సినిమా కోసం ఎంతోమంది చాలా రకాలుగా కష్టపడతారు. కన్నప్ప సినిమాకు మంచి విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ మంచు మనోజ్ పేర్కొన్నారు. హార్డ్ డిస్క్ చోరీ అయినా తర్వాత మనోజ్ కావాలని ఈ పని చేయించాడని అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో మన క్లారిటీ ఇవ్వడంతో అతనిపై వస్తున్న అనేక రకాల ఆరోపణలకు చెక్ పడింది. దీనిపై మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.