మహేష్ చేసిన పనికి షాక్ లో నమ్రత.. ఏమైందంటే..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం నమ్రత సినిమాలలో నటించకపోయినా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన భర్త పిల్లలకు సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. అంతేకాదు మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఈమె హస్తం ఉంది అనడంలో సందేహం లేదు.

ఇకపోతే వంశీ సినిమా ద్వారా వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. 2005 ఫిబ్రవరి 10వ తేదీన వీరిద్దరు ముంబైలో రహస్యంగా వివాహం చేసుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఒక జ్యువెలరీ షాపు ఓపెనింగ్ కు వెళ్లిన నమ్రత కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నమ్రత మాట్లాడుతూ.. నాకు పెద్దగా నగలు లాంటివి నచ్చవు.. చాలా వరకు సింపుల్ గా ఉండడానికి నేను ఇష్టపడతాను.. షాపింగ్ చేయడం కూడా పెద్దగా ఇష్టం ఉండదు.. అయితే మహేష్ మొదటిసారి నాకు వెడ్డింగ్ రింగు బహుమతిగా ఇచ్చారు. మొదట్లో దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను అయితే అది ఎప్పటికీ నాకు ఎవర్ గ్రీన్ గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చింది నమ్రత.

వాస్తవానికి జ్యువెలరీ గురించి మహేష్ బాబు ఎప్పుడు పెద్దగా పట్టించుకోరట. అయితే తన భార్య కోసం ప్రత్యేకించి ఒక రింగును బహుమతి గా ఇవ్వడంతో ఆమె ఆశ్చర్యపోయినట్లు వెల్లడించింది. ఇకపోతే తనకు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లి ఒక బంగారు ఉంగరాన్ని ఇచ్చిందని కూడా తెలిపింది నమ్రత. మొత్తానికైతే నమ్రతా చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news