సినిమాల్లోకి గౌతమ్, సితార ఎంట్రీ.. నమ్రత క్లారిటీ ఇదే

-

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్​.. తమ కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలు సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. సితార ఇటీవల ఓ జ్యువెలరీ సంస్థకు ప్రకటనకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆ సంస్థ స్పెషల్‌ ఈవెంట్‌లో నమ్రత, సితార పాల్గొన్నారు. ఇందులో భాగంగా జర్నలిస్టులు గౌతమ్, సితారల ఎంట్రీ గురించి అడిగారు.

సితార మాట్లాడుతూ.. ‘‘జ్యువెలరీ సంస్థ యాడ్‌లో వర్క్‌ చేయడం సంతోషంగా ఉంది. షూట్‌ కూడా సరదాగా సాగింది. నా ఫొటోలను న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌లో ప్రదర్శించిన రోజు.. ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. నాన్నను హత్తుకుని ఏడ్చేశాను. నాకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉంది. నా ఫస్ట్ రెమ్యునరేషన్‌ను సేవా కార్యక్రమాలకు ఇచ్చాను’’ అని సితార చెప్పుకొచ్చింది.

నమ్రత మాట్లాడుతూ.. ‘‘సితార సినిమాల్లోకి వస్తానంటే మేము అంగీకరిస్తాం. గౌతమ్‌కు ఇప్పుడు 16 ఏళ్లు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. అతడు సినిమాల్లోకి రావడానికి సుమారు ఎనిమిదేళ్లు పట్టొచ్చు. సితార యాక్ట్‌ చేసిన ఈ జ్యువెలరీ యాడ్‌ను మహేశ్ చాలా ఇష్టపడ్డారు. రిపీట్‌ మోడ్‌లో ఎన్నోసార్లు చూశారు. ఇది మాకొక ఎమోషనల్‌ మూమెంట్‌’’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version