కావడి యాత్రలో విషాదం.. కరెంట్​ షాక్​తో ఐదుగురు భక్తులు మృతి

-

ఉత్తర్ ​ప్రదేశ్​లోని మేరఠ్​లో జరుగుతున్న కన్వర్​(కావడి) యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న వారిలో ఐదుగురు భక్తులు మృతి చెందారు. కన్వరీ యాత్రలో భాగంగా వెళ్తున్న ఓ డీజే ట్రక్​..​ 11వేల కేవీ విద్యుత్​ తీగను తగలింది. దీంతో కరెంట్​ షాక్​కు గురై ఐదుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రగాయాల పాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

హరిద్వార్​లో పవిత్ర జలాలను తీసుకుని వెళ్తున్న కన్వరియల వాహనంలో స్పీకర్‌.. మీరట్​ వద్దకు చేరుకున్న తర్వాత విద్యుత్‌ హై టెన్షన్‌ వైరుకు తగిలింది. దీంతో వాహనం మొత్తం కరెంట్‌ షాక్‌ రావడంతో అందులో ఉన్న వారిలో ఐదురుగురు అక్కడికక్కడే మరణించగా.. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. ఆధ్యాత్మిక యాత్రలో ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version