‘కార్తీకేయ-2’తో నిఖిల్‌కు ఫుల్ క్రేజ్.. తదుపరి చిత్రాలకూ దేశవ్యాప్త ఆదరణ !!

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ ‘కార్తికేయ-2’ తో సూపర్ హిట్ పిక్చర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. రూ.వంద కోట్ల క్లబ్ లో ఈ చిత్రం చేరడంతో పాటు హిందీ బెల్ట్ లో బాగా ఆడుతోంది. బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్నది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ‘కార్తీకేయ’కు సీక్వెల్ కాగా, డిఫరెంట్ స్టోరితో తెరకెక్కింది.

కృష్ణ తత్వంతో పాటు మైథాలజీ వర్సెస్ హిస్టరీ అనే అంశాలను దర్శకుడు సినిమాలో చర్చించారు. ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. మొత్తంగా ‘కార్తీకేయ-2’ చిత్రంతో నిఖిల్ కు పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందే అవకాశాలున్నాయని సినీ పరిశీలకులు అంటున్నారు.

కార్తీకేయ-2లో నిఖిల్ , అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లు కాగా, నెక్స్ట్ ఫిల్మ్ ‘18 పేజెస్’లో కూడా సేమ్ జోడీ రిపీట్ కానుంది. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్ స్టోరి అందించారు. ఈ పిక్చర్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. కానీ, కొవిడ్ వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.

ఆల్రెడీ నిఖిల్-అనుపమా పరమేశ్వరన్ లను జంటగా ‘కార్తీకేయ-2’లో చూసి ఆదరించిన ప్రేక్షకులు ‘18 పేజెస్’లోనూ ఆదరిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘18 పేజెస్’ మూవీని హిందీలోనూ రిలీజ్ చేసే చాన్సెస్ ఉన్నట్లు టాక్. కాగా, నిఖిల్ తర్వాత చిత్రం ‘స్పై’ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది.

‘కార్తీకేయ-2’ అనే ఒక్క చిత్రం ద్వారా నిఖిల్ కు మొత్తంగా పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ ఏర్పడటం విశేషమని సినీ పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి.. కార్తీకేయ-2 తర్వాత వచ్చే నిఖిల్ సినిమాలను జనాలు ఏ మేరకు ఆదరిస్తారో…

Read more RELATED
Recommended to you

Exit mobile version