ఇట్స్ అఫీషియల్.. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ మూవీ ప్రారంభం

-

సలార్ ఫేం డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్, హీరో ఎన్టీఆర్‌ కాంబోలో సినిమా వస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆ రూమర్ నిజమైంది. ఈ సినిమాకు సంబంధించి ఇవాళ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ వేడుకలోఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ కుటుంబసభ్యులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ‘#NTRNeel’ హ్యష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది.

2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్తో సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా తెరకెక్కించనున్నట్లు ప్రశాంత్ నీల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version