జె బ్రాండ్ మద్యం వల్లే….ఏపీలో కిడ్నీ, లివర్ వ్యాధులు !

-

జగన్ ప్రవేశపెట్టిన జె బ్రాండ్ మద్యం వల్లే….ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పలువురు కిడ్నీ..లివర్ వ్యాధులతో బాధపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్. నెల్లూరులో బి.జె.పి.కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్..అనంతరం మాట్లాడారు. గత ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని పూర్తి అవినీతి మయం చేశారని…అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఫైర్‌ అయ్యారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉన్న రూ. 400 కోట్లను మళ్ళించారని… అన్ని శాఖలను నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు మంత్రి సత్య కుమార్.

sathya kumar on jagan

జగన్ ప్రవేశపెట్టిన జె బ్రాండ్ మద్యం వల్లే రాష్ట్రంలో పలువురు కిడ్నీ..లివర్ వ్యాధులతో బాధపడుతున్నారు….ఆరోగ్యశ్రీ ని తీసేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఆరోగ్యశ్రీ పేరును మాత్రమే మార్చామని… కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని కూడా దీనికి జోడించామని క్లారిటీ ఇచ్చారు. జగన్ ను రాష్ట్రంలో ప్రజలు ఎవరూ నమ్మడం లేదని… చివరికి ఆయన తల్లి ..చెల్లి కూడా నమ్మడం లేదని చెప్పారు. అందుకే ఢిల్లీ వెళ్లి అబద్దాల చెబుతున్నాడు… రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అవసరమైన నిధులను ఇస్తోందని తెలిపారు మంత్రి సత్య కుమార్. కేంద్రం.. రాష్ట్రం కలిసి మరింత ప్రగతిని సాధిస్తాం… కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసమే చట్టంలో సవరణలు చేస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version