బాలయ్య షో కి రానున్న అప్పటి స్టార్ హీరోయిన్

-

బాలకృష్ణ అన్​స్టాపబుల్​ సీజన్ 2 సైతం మంచి ఆదరణతో దూసుకుపోతుంది. నారా చంద్రబాబు నాయుడు చీఫ్​ గెస్ట్​గా వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ విపరీతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అయితే ఈ ఎపిసోడ్​ తొలి నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్​ స్ట్రీమింగ్స్​ అయినట్లు ఆహా పేర్కొంది. ‘అతడొచ్చాడు, పాలించాడు. హిస్టరి క్రియేట్ చేశాడు మళ్లీ’ అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది.

ఇక సెకండ్ ఎపిసోడ్ గెస్ట్స్ గా యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నల గడ్డ సందడి చేశారు. ఈ ఇద్దరు కుర్ర హీరోలతో బాలయ్య సంభాషణ ఎంటర్​టైన్​గా సాగింది. అమ్మాయిలకు లైన్ వేసే విషయాల నుంచి చీకటి పడ్డాక వేసే పెగ్ వరకూ అన్ని విషయాల గురించి సరదా సరదాగా మాట్లాడుకున్నారు.

అయితే ఇక ఆ తర్వాత ఎపిసోడ్ కోసం బాలయ్య.. ఓ అందాల భామను సిద్ధం చేశారు. ఆమె మరెవరో కాదు నీలాంబరిగా ఆడియన్స్ మదిలో నిలిచిపోయిన సీనియర్​ నటి రమ్యకృష్ణ.. ఇప్పుడు యువతరం మదిలో శివగామిగా చెరగని ముద్ర వేశారు. ఆమె తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఇప్పటికీ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. అమెనే ఈ ఎపిసోడ్​తో బాలయ్యతో సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా సోషల్​మీడియాలో ట్వీట్ చేసింది. ఈ ఎపిసోడ్​ ప్రీమియర్​ ఈ శని, ఆదివారం రాత్రి 9గంటలకు ప్రసారం కానున్నట్లు తెలిపింది.

అయితే ఈ షోలో.. బాలయ్య.. ఆమెను ఎలాంటి ప్రశ్నలను అడుగుతారో చూడాలి. అయితే ఆమెకు.. తన భర్త కృష్ణ వంశీతో విబేధాలు ఉన్నట్లు గతంలో వచ్చాయి. ఇంకా కొన్ని కాంట్రవర్సీ విషయాల్లోనూ ఆమె పేరు వినిపించింది. ఈ సున్నితమైన విషయాలను బాలయ్య టచ్​ చేసే అవకాశముందని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా, బాలయ్య-రమ్యకృష్ణ కలిసి గతంలో వంశోద్ధారకుడు, దేవుడు సహా పలు చిత్రాల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version