అసలైన పాన్‌ఇండియా మూవీ ‘ది కేరళ స్టోరీ’ : వర్మ

-

అనేక వివాదాల నడుమ విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ సినిమాలో తమిళం, మలయాళం గర్ల్స్ ప్రధాన పాత్ర పోషిస్తే… గుజరాత్ కు చెందిన వ్యక్తి నిర్మించారని, హిందీ సినిమాగా బెంగాలీ వ్యక్తి డైరెక్ట్ చేశారని ట్విట్ చేశారు. ఇన్ని కలయికలు ఉన్న ఈ సినిమాకు అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందని చెప్పారు.

దీంతో నిజమైన పాన్ ఇండియా మూవీగా మారుతోందని పేర్కొన్నారు. అయితే‘ది కేరళ స్టోరీ’ సినిమాపై పాజిటివ్ ప్రచారం చేసినందుకు ఓ వ్యక్తిని బెదిరించడంతోపాటు కొట్టారు. రాజస్థాన్ లో జరిగిన ఈ సంఘటనలో ముగ్గురిపై కేసు నమోదు అయింది. బాధితుడు VHPకి చెందిన కార్యకర్త కాగా, సినిమాను చూడమని ఓ యువతకి మెసేజ్ పంపడంతో పాటు వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. అయితే బాధితుడు బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. అనంతరం బెదిరించి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version