ఓటీటీలోకి ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’.. కానీ చిన్న ట్విస్ట్..?

-

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. స్టార్ హీరో రణ్​వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ. చాలా గ్యాప్ తర్వాత కరణ్​జోహార్ తెరకెక్కించిన ఈ సినిమా జులై 28న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపు ఫలించింది.

ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని వీక్షించాలంటే రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రేటు చూసి చాలా మంది వామ్మో ఇంత ధరనా అని ముక్కున వేలేసుకుంటునన్నారు. మరికొందరేమో థియేటర్​లో టికెట్ ధర కంటే ఎక్కువగా ఉంది గా బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక థియేటర్​లో చూడటం మిస్ అయిన వాళ్లు ధర ఎక్కువైనా సరే చూడాలని ఫిక్స్ అయిపోయి సినిమాను ఓటీటీలో చూసేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version