రేపే BRO రిలీజ్.. ఫ్యాన్స్​కు సాయిధరమ్ తేజ్ రిక్వెస్ట్

-

టాలీవుడ్​తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రో సినిమా రేపు విడుదల కానుంది. సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో పవన్‌కల్యాణ్‌ కీలకపాత్ర పోషించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. అభిమానులను ఉద్దేశిస్తూ సాయితేజ్‌ ట్వీట్ చేశారు. వేడుకల్లో జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన సూచించారు.

‘‘డియర్‌ ఫ్యాన్స్‌.. మీరు నాపై చూపిస్తోన్న అమితమైన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. ‘బ్రో’ని ఒక స్పెషల్‌ ప్రాజెక్ట్‌గా భావించి మా చిత్రాన్ని మీరెంతగానో సెలబ్రేట్‌ చేస్తున్నారు. దీనిని మరింత ఎక్కువమందికి చేరువ చేయడం కోసం భారీ కటౌట్స్‌, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా మీ ప్రేమను పొందుతున్నందుకు గర్వపడుతున్నా. బ్యానర్స్‌, కటౌట్స్‌ ఏర్పాటు చేసే సమయంలో దయచేసి జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా వ్యవహరించండి. మీరు సురక్షితంగా ఉండటమే నాకు ముఖ్యం. ఈ సంతోషకరమైన వేడుకల్లో మీకు ఏమైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను’’ అని సాయితేజ్‌ పేర్కొన్నారు. ఇటీవల ఏపీలో హీరో సూర్య పుట్టినరోజున బ్యానర్ ఏర్పాటు చేస్తూ కరెంట్ షాక్​తో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news