నన్ను అనేంత *** ఉన్నాయా?.. పవన్‌పై శ్రీ రెడ్డి కామెంట్స్

-

పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి వ్యవహరం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గానీ ఇతర హీరోలెవరూ గానీ ఆమెను పేరు పెట్టి ప్రత్యక్షంగా పేర్కొనరు, ధూషించరు. అయితే శ్రీ రెడ్డి మాత్రం అలా కాదు, ఎవరి మీదనైనా,ఎంతటి వారి మీదనైనా సరే కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతుంది. మామూలు కామెంట్స్ అయితే పర్లేదు కానీ రాయకూడని, వినలేని పదజాలంతో రెచ్చిపోతుంది. దీంతో ఆమె చేసే పోస్ట్స్ తెగ వైరల్ అవుతుంటాయి.

నిన్న (మార్చి 14) జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎమోషనల్‌గా సాగింది. తన జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులు, రాజకీయంగా ఎదురైన అవమానాల గురించి చెప్పుకుంటూ వెళ్లాడు. అందులో భాగంగానే తన తల్లిని కూడా అనరాని మాటలు అన్నారని, అయినా వదిలేశానని, రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి కోపాన్ని వదిలేశానని చెప్పుకొచ్చాడు. అయితే వీటిలో శ్రీరెడ్డిని పరోక్షంగా ప్రస్తావించినట్టే ఉంది.

ఏమీ అనకుండా ఉంటేనే పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే శ్రీ రెడ్డి.. ఇలా పరోక్షంగా అంటే ఊరుకుంటుందా? రెచ్చిపోయి ఓ పోస్ట్ చేసింది. ‘నిన్ను ఇప్పుడు పొలిటిషియన్ ఎవరన్నారురా పీకే..ప్రజా సేవ చేస్తా అని మళ్లీ సినిమాలు చేసుకుంటున్నావ్.. నన్ను అనేంత బాల్స్ ఉన్నాయా నీకు?’ అంటూ రెచ్చిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news