‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సక్సెస్ పై సుహాస్ ఎమోషనల్ పోస్టు

-

టాలీవుడ్ నటుడు సహాస్ కథానాయకుడిగా నటించిన సినిమా  ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ సినిమా ఇటీవలే విడుదలై, పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పర్యటిస్తూ ప్రేక్షకులకు థ్యాంక్స్‌ మీట్ లు పెడుతోంది. తాజాగా సుహాస్‌ సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమా సక్సెస్ పై ఎమోషనల్ పోస్ట్‌ పెట్టారు.

‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాని మేం అనుకున్నట్లుగానే ప్రేమతో ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. యూట్యూబ్‌లో నా షార్ట్‌ఫిల్మ్స్‌కి కామెంట్స్‌ పెట్టడం నుంచి ఇప్పుడు ‘బుక్‌ మై షో’లో టికెట్స్‌ కొనేవరకు.. నన్ను ప్రేమతో నడిపిస్తూనే ఉన్నారు. మీ ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను. నటుడిగా నా స్థాయి మేరకు మంచి కథలను ఎంపిక చేసుకుని మీ ముందుకు తీసుకురావాలనేదే నా ప్రయత్నం. కలర్‌ ఫొటో, రైటర్‌ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. అలా వచ్చినవే’’

‘‘నేను కథానాయకుడిగా నటించిన ‘ప్రసన్న వదనం’, ‘కేబుల్‌ రెడ్డి’, దిల్‌ రాజు నిర్మాణంలో సందీప్‌ రెడ్డి బండ్ల తెరకెక్కిస్తున్న చిత్రంతో త్వరలో మీ ముందుకురాబోతున్నాను. హ్యాట్రిక్‌ సక్సెస్‌ ఇచ్చినందుకు మరోసారి థ్యాంక్స్‌. మరో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకునేందుకు ప్రయత్నిస్తా’’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version