సూర్య ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. కంగువా గ్లింప్స్‌ రిలీజ్​కు మూహుర్తం ఫిక్స్‌

-

సూర్య ఫ్యాన్స్ గెట్ రెడీ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూర్య లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది. కోలీవుడ్​లోనే అత్యంత భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న సూర్య మూవీ కంగువా నుంచి ఓ క్రేజీ అప్డేట్​ను ఇచ్చారు మేకర్స్. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్​లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సూర్య బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ హాట్ బాంబ్ దిశా పటానీ నటిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ జులై 23న రిలీజ్‌ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. కంగువా గ్లింప్స్‌ను శనివారం అర్ధరాత్రి 12:01 నిమిషాలకు విడుదల చేస్తామని చెబుతూ.. ఓ స్పెషల్ పోస్టర్‌ను వదిలారు. ఖడ్గం కంటే తన కళ్లే పదునైనవి అని క్యాప్షన్​తో ఉన్న పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య యుద్ధ వీరుడుగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా ఈజీగా వేయి కోట్లు వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అప్పుడే ఓ అంచనాకు వచ్చేశాయట.

Read more RELATED
Recommended to you

Latest news