ఆ కారణంగానే ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మాట్లాడుకోవడం లేదా..?

-

మిగతా వాళ్లతో పోల్చుకుంటే ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు, హీరోయిన్లకు ఎప్పుడు ఒకటే ఆలోచన అందరికంటే ఉన్నతంగా ఉండాలి అని.. అదే వాళ్ళకి రాత్రి పగలు అనే తేడా లేకుండా సినిమా కోసం కష్టపడుతూ ఉండేలా చేస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా షార్ప్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అవకాశాలు అందుకుంటూ పోతూ ఉంటారు. ముఖ్యంగా సినిమాలలో హీరోగా చేస్తున్న నటుల మధ్యే కాదు హీరోయిన్లుగా చేస్తున్న నటీమణుల మధ్య కూడా ఈ ఈగో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి.

అయితే ఇప్పట్లో ఈ విషయాలు పెద్దగా పట్టించుకోకపోయినా అప్పట్లో రమ్యకృష్ణ, మీనా వంటి స్టార్ సీనియర్ హీరోయిన్ల మధ్య ఎక్కువగా ఈగో ప్రాబ్లం ఉండేదని చాలామంది చెబుతూ ఉంటారు. అందుకే వాళ్ళిద్దరూ కూడా కలిసి ఎక్కువగా సినిమాలలో నటించలేదన్న వార్త కూడా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. వాస్తవానికి అటు రమ్యకృష్ణ సినీ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా భారీ పాపులారిటీ దక్కించుకుంటే.. మరొకపక్క హీరోయిన్ గా మీనా అంతకుమించి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

అయితే ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడ వీరిద్దరికి గొడవ జరిగినట్టు దాఖలాలు లేవు. కానీ వీరిద్దరి మధ్య ఉన్న ఒక ఈగో కారణంగానే ఇద్దరికీ పడదు అన్న వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఒకరికి మించి మరొకరికి అవకాశాలు వస్తూ ఉండడం వల్లే ఇలా ఇద్దరి మధ్య ఈగో క్లాష్ అయిందని అందుకే వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని సమాచారం. ఇకపోతే మీనా భర్త చనిపోయిన తర్వాత మీనా ఒంటరి అయి.. అడపాదడపా అవకాశాలు అందుకుంటుంటే.. రమ్యకృష్ణ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాలతో మళ్లీ బిజీగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news