థియేటర్​లో రిలీజ్ కానున్న.. ఓటీటీ థ్రిల్లర్‌​ మూవీ సీక్వెల్ ‘పొలిమేర-2’

-

కరోనా సమయంలో ఓటీటీలో రిలీజ్ అయి సెన్సేషన్ సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. సత్యం రాజేశ్‌, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్‌-సస్పెన్స్‌ థ్రిల్లర్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వేదికగా ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం సూపర్​ హిట్​ టాక్‌ను దక్కించుకుంది.  క్షుద్ర పూజలు, తంత్రాలు వంటి అంశాలతో ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో మంది అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు.

ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్‌కు సంబంధించి ఓ సూపర్ అప్డేట్​ను మూవీటీమ్​ ఇచ్చింది. ‘మా ఊరి పొలిమేర 2’ ఈ సారి థియేటర్లలో రానున్నట్లు తెలిపింది. నవంబర్‌ 2న రిలీజ్ కానుందంటూ ఓ స్పెషల్​ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. డాక్టర్‌ విశ్వనాథ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, రవి వర్మ, చిత్రం శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news