సింధూ మీనన్ సినీ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం.?

-

చందమామ.. ఈ సినిమాతో నవదీప్ .. శివ బాలాజీ.. కాజల్ అగర్వాల్.. సింధు మీనన్ ఇలా వీరందరూ కూడా ఈ సినిమాతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలలో నటించి అభిమానులకు చేరువ అయ్యింది. చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకున్న సింధుమీనన్ కన్నడ సినిమాలలో బాల నటిగా రంగప్రవేశం చేసి తన చిన్నవయసులోనే ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక 13 సంవత్సరాల వయసుకే కన్నడ సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె , తనకు 15 సంవత్సరాల వయసులో శ్రీహరి హీరోగా వచ్చిన భద్రాచలం సినిమాలో హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేసింది.

తర్వాత తెలుగు , తమిళ్ , మలయాళం, కన్నడ ఇలా అన్ని దక్షిణాది భాషా చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు మలయాళం బుల్లితెర మీద ఒక ప్రోగ్రాం లో హోస్ట్ గా కూడా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యింది. ఇక 2007లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రభు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత సింధు మీనన్ సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిందని చెప్పవచ్చు. అయితే పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడినట్లూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇక భర్తకు వ్యాపారాలలో చేదోడువాదోడుగా ఉంటోంది. వీరికి ఒక అమ్మాయి , ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు.

సింధు మీనన్ తన భర్త పిల్లలతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది చూసిన నెటిజన్లు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అంతేకాదు ఒకప్పుడు సినిమాలలో నటించిన సింధుమీనన్ బక్కగా ఉన్నా.. ప్రేక్షకులను మాత్రం బాగా అలరించింది. కానీ ఇప్పుడు ఈమె కొంచెం బొద్దుగా చాలా అందంగా కనిపిస్తున్న ట్లు తెలుస్తోంది. అభిమానుల కోరిక మేరకు త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇందులో నిజం ఉందో తెలియదు కానీ సింధు మీనన్ మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆమె అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version