లవ్ స్టోరీ తర్వాత మూడు సినిమాలని లైన్ లో పెట్టిన నాగ చైతన్య ..!

-

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ స్టోరీ” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫిదా బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజై ప్రేక్షకులను పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. మజిలీ, వెంకీమామా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్లాన్ లో ఉన్నాడు. ఇక లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య మొత్తం మూడు సినిమాలని ఓకే చేసి లైన్ లో పెట్టాడని తాజా సమాచార. తండ్రి నాగార్జున తో కలిసి బంగార్రాజు లో నటిస్తాడని ముందు నుంచి చెప్పుకుంటున్నదే. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా తర్వాత నాగచైతన్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి “థ్యాంక్యూ” అనే టైటిల్ అనుకుంటున్నారట. గతంలో విక్రమ్ కె కుమార్ అక్కినేని ఫ్యామిలీకి “మనం” లాంటి మధురానుభూతిని ఇచ్చిన సంగతి తెలిసిందే.

విక్రమ్ కె కుమార్ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహనక్రష్ణతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. అష్టాచమ్మా, జెంటిల్ మేన్, సమ్మోహనం వంటి హిట్ సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నాడు ఇంద్రగంటి మోహనక్రష్ణ. దాంతో ఇంద్రగంటి మోహనక్రష్ణ నాగ చైతన్య కాంబినేషన్ మీద మంచి అంచనాలున్నాయి. ఇక ఈ మూడు సినిమాల తర్వాత అన్ని కుదిరితే నందిని రెడ్డి తోను ఒక సినిమాని చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news