సూపర్ హిట్ కాంబో రిపీట్.. 17 ఏళ్ల తర్వాత మెగాస్టార్​తో త్రిష!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్య హిట్ జోష్ మీద ఉన్న చిరు.. ఇప్పుడు తన నెక్స్ట సినిమాపై ఫోకస్ చేస్తున్నారు. మెగాస్టార్ లేటెస్ట్ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. మారేడుమిల్లి అడవుల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్న ఈ సెట్​లోకి త్వరలోనే చిరంజీవి అడుగు పెట్టనున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్​పై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది.

అయితే మొదట బాలీవుడ్ బ్యూటీలు.. ఆ తర్వాత అనుష్క.. ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే ఈ ఛాన్స్ ఎట్టకేలకు తమిళ్ బ్యూటీ త్రిషకు దక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి-త్రిష కలిసి స్టాలిన్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ కలిసి వెండితెరపై సందడి చేయబోతోంది. ఈ కాంబో కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే పేరు ప్రచారంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news