Veera Simha Reddy : బాలయ్య బాబు బాక్సాఫీస్ ఊచకోత

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తాజాగా బాలకృష్ణ తెరకెక్కించిన చిత్రం వీరసింహారెడ్డి. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించి మెప్పించింది. ఇందులో కీలకపాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటించగా.. ఈమె చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలెట్గా నిలిచాయి.

దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ కి కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. ఇకపోతే వీరసింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా మొదటి రోజు కలెక్షన్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా ఒక్క రోజే 54 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version