అన్నా లెజినోవ గుండుపై ట్రోలింగ్.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు !

-

అన్నా లెజినోవ గుండుపై ట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో .. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అంటూ ఫైర్ అయ్యారు.

vijayashanthi comments on Anna Lezhinova

అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదని పేర్కొన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news