Bigg Boss Telugu 8 : కొత్త క్లాన్‍లలో ఎవరున్నారు..? అందరూ సలాం పెడుతున్నారంటూ విష్ణుప్రియపై నాగార్జున పంచ్..!

-

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ తో పాటుగా అభయ్ కొత్త చీఫ్ గా ఎంపికయ్యారు. ఈ రెండు క్లాన్లలో ఎవరు ఉంటున్నారు అనేది ఆసక్తికరంగా ఉంది ఆదివారం ఎపిసోడ్ కావడంతో ఈరోజు ఫన్ గేమ్స్ తో పాటుగా ఎలిమినేషన్ కూడా ఉంటుంది. ఇద్దరి క్లాన్లలోకి కంటెస్టెంట్లు రాబోతున్నారు. నేటి ఎపిసోడ్లో క్లాన్ లోకి కంటెస్టెంట్లు రాకతో పాటుగా ఎలిమినేషన్ చూడొచ్చు హౌస్ కి ఇద్దరు చీఫ్స్ అయితే ఫిక్స్ అయ్యారు. ఎవరు ఏ ప్లాన్ లో ఉంటారనేది మాత్రం చెప్పలేదు. తర్వాత నిఖిల్ క్లాన్లోకి వెళ్తానని విష్ణుప్రియ చెప్తుంది తన గొయ్యి తానే తీసుకుంటున్నానని ఈ విష్ణు సరదాగా అంటుంది. నిఖిల్ ఎక్కువగా వింటూ ఉంటాడని అతని క్లాన్ లోకి వెళ్తానని శేఖర్ బాషా చెప్తారు.

దీంతో నువ్వు మాట్లాడతానే ఉంటే వినే వాళ్ళు కావాలి అని అతనిపై నాగార్జున జోక్ వేస్తారు అని నబిల్ చెప్తాడు. అతన్ని నిఖిల్ అని నెక్స్ట్ అభయ్ అని అన్నారు దీంతో అందరూ నవ్వారు. అయితే ఎవరు ఏ క్లాన్ లో ఉంటారనేది బయటకొచ్చింది నిఖిల్ క్లాన్లో సోనియా, విష్ణు ప్రియ, సీత, పృథ్వి, నైనిక ఉండబోతున్నారు. అభయ్ క్లాన్ లో ఆదిత్య, యష్మి, మణికంఠ, నబీల్, ప్రేరణ ఉంటారు. అయితే దీనిపై ఈరోజు క్లారిటీ వస్తుంది.

శేఖర్ భాష ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రం విచిత్రం అని కంటెస్టెంట్లకు గేమ్ పెడతారు నాగార్జున. ఫోటోలను వస్తువుల్ని చూసి అందులోని వాటితో సరైన పదాలు చెప్పేలాగే ఇచ్చారు. ఆపిల్ మిరపకాయలని చూపిస్తే మెరుపులు అంటూ శేఖర్ ఏదో లాజిక్ చెప్పారు మిరపకాయలోని మిర ఆపిల్ లోని పిల్ మెరుపులని అంటాడు. దీంతో పాయింట్ గోవిందా అని నాగార్జున అంటారు. శేఖర్ బాష ఈ వారం ఎలిమినేట్ అవుతారని లీకులు వచ్చాయి శేఖర్ భార్య కొడుకుకు జన్మనిచ్చారు. దీంతో అతను బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news