పాకెట్ మనీ కోసం రాత్రుళ్ళు అలా చేయక తప్పలేదు – వైష్ణవి చైతన్య

-

థియేటర్లలో ప్రస్తుతం భారీగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకులను అలరిస్తున్న చిన్న చిత్రాలలో బేబీ కూడా ఒకటి. ఇందులో నటించిన ప్రముఖ యూట్యూబర్ ,తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్యకు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు స్టార్ హీరోలు కూడా ఆమె నటనకు ఫిదా అయి ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈమె ఇండస్ట్రీలోకి రావడం ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి అని కూడా చెబుతున్నారు.ఇకపోతే మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న వైష్ణవి చైతన్య ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడింది.

డబ్ స్మాష్, టిక్ టాక్ వంటి వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ , వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. అంతే కాదు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. కానీ అవి పెద్దగా ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. ఇదిలా ఉండగా డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ సినిమా చేసి హీరోయిన్గా ఎక్కడ లేని క్రేజ్ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను పడ్డ కష్టాలను తెలిపింది. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. నేను పదవ తరగతి చదువుతున్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలను తీసుకున్నాను. అప్పుడు నాకు తెలిసింది కేవలం డాన్స్ మాత్రమే.. బర్తడే, పెళ్లి లాంటి ఈవెంట్స్ లో డాన్స్ చేసేదాన్ని.. ఎక్కువగా రాత్రులు బర్తడే పార్టీలు జరిగేవి వాటిలో డాన్స్ చేస్తే 700 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుతో మా అమ్మ బియ్యం కొనుక్కొని వచ్చేది. ఇక యూట్యూబ్ లో వీడియోలు చేయడానికి కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి ప్రత్యేక గది కూడా ఉండేది కాదు.

వాష్ రూమ్ కి వెళ్లి దుస్తులు మార్చుకునే దాన్ని . ఇక అదంతా చూసి అమ్మ ఏడుస్తూ ఎందుకమ్మా ఇదంతా వద్దు వదిలేయని బాధపడింది. అయినా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అయితే ఒకసారి ఒక సినిమాలో చిన్న పాత్ర చేశాను. మనకంటూ క్యారవాన్ ఉండదు కాబట్టి పెద్ద ఆర్టిస్ట్ దగ్గరకు వెళ్లి వాష్ రూమ్ కోసం మీ క్యారవాన్ వాడుకోవచ్చా అని అడిగితే ఆమె నానా మాటలు అన్నది. అప్పుడు ఏడుపు ఒక్కటే మిగిలింది ఈ సంఘటన నన్ను చాలా బాధ పెట్టింది. కానీ వాటన్నింటినీ పట్టించుకోలేదు అంటూ ఆమె తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version