మిజోరంలో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి

-

ఇండియాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈశాన్య రాష్ట్రం అయిన మిజోరంలో ఘోర ప్రమాదం జరిగింది.ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 17 మంది మరణించారు. మిజోరాంలోని సైరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలి ఏకంగా 17 మంది కూలీలు మరణించారు.

దాదాపు 45 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ ఉదయం 10 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతుంది. ఇక ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందట. ఇక ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను కలచివేసిందని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version