మీరు కోటేశ్వరులు కావాలంటే ఇంట్లో వీటిని తప్పక ఉంచాలి..

-

భూ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి బాగా డబ్బులను సంపాదించాలని అనుకుంటారు.. అందులో తప్పు లేదు..ఎందుకంటే మనిషి ఆశా జీవి ఎంత ఉన్న సరిపోదు ఇంకా కావాలి అని అనుకుంటాడు.డబ్బు తో ఈ సృష్టి ముడిపడి ఉంటుంది. అందుకే మనుషులు అంతగా ఇది అవుతున్నారు.కానీ చాలా సార్లు కష్టపడి పనిచేసినా విజయం లభించకపోవటం, కావాలనుకున్నా డబ్బు ఆదా చేసుకోలేక పోవడం ఇదంతా వాస్తు వల్ల కూడా జరగవచ్చు. అందువల్ల ఈ రోజు కొన్ని వాటి గురించి తెలుసుకుందాం.. మన ఇంట్లో కొన్ని వస్తువుల పై శ్రద్ద పెడితే పట్టిందల్లా బంగారమే అవుతుందని చాలామంది నమ్మకం..అసలు జ్యోతిష్య పండితులు ఏం అంటున్నారు అనేది ఒకసారి చుద్దాము..

ఇంట్లో చెత్తను ఉంచవద్దు..

చాలాసార్లు పగిలిన పాత్రలు, చెత్తాచెదారాన్ని ఇంట్లోనే ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత ఉంటుంది. మీరు కూడా ఇంట్లో విరిగిన మంచం ఉంచకూడదు ఎందుకంటే ఇది ఆర్థిక ప్రయోజనాలను తగ్గిస్తుంది. ఖర్చులను పెంచుతుంది. మీరు ఇంట్లో ఏదైనా మూలలో చెత్తను నిల్వ ఉంచినట్లయితే వెంటనే దాన్ని బయట పడేయ్యాలని గుర్తించుకోవాలి..

లక్ష్మీ దేవి పటం..

మీరు సంపద, ఆస్తి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ ఇంట్లోని భద్రంగా డబ్బు ,నగలతో పాటు మా లక్ష్మి దేవి పటాన్ని కూడా ఉంచండి.. అమ్మవారి అనుగ్రహం ఉంటే మీకు తిరుగులేదు..

బెడ్ రూమ్ లో మెటల్ వస్తువు..

వాస్తు శాస్త్రం ప్రకారం పడకగది ప్రవేశానికి ఎదురుగా ఉన్న గోడపై ఒక మెటల్ వస్తువును వేలాడదీయండి. ఇది గోడ ఎడమ మూలలో ఉండాలి. ఈ ప్రదేశం అదృష్టం, సంపద ప్రాంతంగా పరిగణిస్తారు. అందుకే ఇలా చేయడం వల్ల మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉండదు. కానీ మీరు మెటల్ వస్తువును వేలాడుతున్న గోడ పలిగినట్లు లేదా నెరి చీలినట్లు ఉండకూడదు..ఇది గమనించండి..

కుళాయి నీరు..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎక్కడైనా కుళాయి నుండి నీరు కారుతుంటే మీరు దాని వల్ల ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా మంది కొన్నిసార్లు ట్యాప్ నుండి నీరు కారడాన్ని మర్చిపోతారు.ఇది చాలా పెద్ద తప్పు అందుకే మీ ఇంట్లో కుళాయి నుండి కూడా నీరు కారుతుంటే ఆలస్యం చేయకుండా సరి చేసుకోండి..

పైన తెలిపిన వాటిపై శ్రద్ద పెడితే మాత్రం లక్ష్మి దేవి మీ ఇంట్లో కాలు పెడుతోంది..సుఖ సంతోషాలు వెలువెత్తుతాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version