నటి రన్యారావు కేసులో మరో ట్విస్టు

-

దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి అరెస్టయిన కన్నడ నటి రన్యారావు కేసులో తవ్వుతున్న కొద్ది డొంక కదులుతోంది. ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఆమె హవాలా డబ్బు వినియోగించినట్లు డీఆర్ఐ విచారణలో తేలింది. నటి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా డీఆర్‌ఐ తమ విచారణలో తేలిన విషయాలను న్యాయస్థానానికి తెలిపింది.

ఈ నేపథ్యంలో బంగారం కొనేందుకు తాను హవాలా డబ్బు వాడినట్లు స్వయంగా రన్యారావు అంగీకరించినట్లు డీఆర్‌ఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో మరో నిందితుడు తరుణ్‌రాజ్‌కు ఆమె ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. ఆమె పంపిన డబ్బుతోనే అతడు దుబాయ్ నుంచి హైదరాబాద్‌ వెళ్లాడని .. ఈ ఇద్దరూ బ్యాంకాక్, జెనీవాకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవారని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. హోటల్‌ వ్యాపారి తరుణ్‌రాజ్‌, రన్యారావు స్నేహితులని.. వీరిద్దరూ 2023లో దుబాయ్‌లో విరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్‌ఎల్‌సీ (LLC) అనే ట్రేడింగ్‌ కంపెనీని స్థాపించారని కోర్టుకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version