తులసి మొక్కతో ఈ పరిహారాలను పాటిస్తే.. అదృష్టం మీ సొంతం..!

-

జీవితంలో సమస్యలు సహజమే. ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు, కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని అధిగమించడానికి ఎన్నో పరిహారాలను పాటించవచ్చు. అటువంటి పరిహారాలలో తులసి మొక్కతో కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. హిందువులు అందరూ తులసి మొక్కను ఖచ్చితంగా ఇంట్లో పెడతారు మరియు తులసి మొక్కను ఉదయం, సాయంత్రం పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు తగ్గించుకోవచ్చు, ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. అంతేకాకుండా, ఎండిపోయిన తులసి మొక్కతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పరిహారాలను పాటించడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి, అందరూ సంతోషంగా జీవించగలుగుతారు.

అయితే, కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం వల్ల పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. అటువంటి సమయంలో ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోవాలంటే తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావించి ప్రార్థన చేయాలి. దీనితో పాటు ఎండిపోయిన తులసి మొక్కను కూడా ఉపయోగించవచ్చు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందేందుకు ఎండిపోయిన తులసి మొక్కలను తీసుకుని ఏడు కొమ్మలు దారంతో కట్టి నేతి లో వేయాలి. ఇలా చేసిన తర్వాత విష్ణుమూర్తి ముందు పెట్టి వెలిగించాలి. దీని ద్వారా అదృష్టాన్ని పొందవచ్చు, అంతేకాకుండా సంతోషంగా జీవించగలుగుతారు.

జీవితంలో ప్రతికూల శక్తిని తొలగించడానికి ఎండిపోయిన తులసి ఆకులను గంగాజలంలో వేసి ఆ నీటిని ఇంట్లో చల్లాలి. ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఎండిపోయిన తులసి కొమ్మలను చిన్న ముక్కలుగా చేసి దారం చుట్టి గురువారం రోజున పూజలో ఉపయోగించాలి. తర్వాత ఎర్రటి వస్త్రం లో చుట్టి పర్సులో పెట్టాలి. ఇటువంటి పరిహారాల ద్వారా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చు, ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. కనుక, తప్పకుండా వీటిని ప్రయత్నించి ఆనందంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించండి.

Read more RELATED
Recommended to you

Latest news