వాస్తు: ఈ తప్పులు చేస్తే మీ డబ్బులు పోవడం ఖాయం..

-

ఎంతగానో కష్టపడి సంపాదించిన డబ్బు వృధాగా పోకుండా నిలవాలని మనలో ప్రతీ ఒక్కరూ కూడా కోరుకుంటారు. అయితే కొంతమందికి మాత్రం సంపాదించిన డబ్బు అస్సలు నిలవదు. సంపాదించిన సొమ్ము, సంపాదించినట్లుగానే వృధాగా ఖర్చవుతుంది. చాలా మందికి కూడా వారు సంపాదించిన డబ్బులు మొత్తం నీళ్లు తాగినంత ఈజీగా ఖర్చవుతుంటుంది.ఇలా డబ్బులు వృధాగా పోవడానికి వాస్తు దోషాలు కూడా కారణమవుతాయని వాస్తు పండితులు చెబుతుంటారు. అందుకే వాస్తు విషయంలో కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు.మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు మనల్ని ఆర్థికపరమైన నష్టాలకు దారి తీస్తాయి. ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణమయ్యే వాస్తు దోషాలు గురించి తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం మన ఇంట్లో ఉండే నీటి కుళాయిలో లీకేజ్‌ కాకుండా కచ్చితంగా చూసుకోవాలి. చాలా మంది కూడా దీనిని సర్వ సాధారణ సమస్యగా భావిస్తారు. అయితే దీనివల్ల ఇంట్లో కచ్చితంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవు. దీనివల్ల డబ్బు వృధాగా ఖర్చవుతుంది. వీటితో పాటు ఇంట్లో విరిగిన వస్తువులను ఇంకా పనిచేయని వస్తువులు ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.ఇక వంటింటికి సంబంధించి వాస్తును తూచా తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. వంటిల్లు కచ్చితంగా ఆగ్నేయ దిశలో ఉండాలని వాస్తు చెబుతున్నారు. ఎందుకంటే ఆగ్నేయంలో వంట చేయడం వల్ల ఆ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. అందువల్ల డబ్బు కూడా సమకూరుతుంది.

ఈశాన్యం దిక్కును దేవుడి స్థానంగా భావిస్తారు. కాబట్టి ఈశాన్యం మూల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దిశలో అసలు చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. ఇంకా అలాగే ఈశాన్యం మూలలో ఎలాంటి వస్తువులు లేకుండా కూడా చూసుకోవాలి. ఈశాన్యంలో నీటి ఫౌంటెన్‌ కనుక ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు.ఇక నైరుతి దిక్కు అనేది సంపదకు, స్థిరత్వానికి ప్రతీక. అందుకే నైరుతి దిశ బాగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా నైరుతిలో చెత్తవేయడం ఏమాత్రం చేయకూడదు. ఎందుకంటే ఈ దిక్కును నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఆర్థిక నష్టాలు కచ్చితంగా సంభవిస్తాయి. ఇంట్లో ఖర్చులు కూడా పెరిగిపోతాయి. కాబట్టి ఈ దిశ విషయంలో కచ్చితంగా చాలా జాగ్రత్తపడాలి.

Read more RELATED
Recommended to you

Latest news