రేపు శంషాబాద్‌కు కేంద్ర మంత్రి రాక

-

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ శుక్రవారం శంషాబాద్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం శంషాబాద్‌లోని ఉందానగర్ రైల్వేస్టేషన్ సందర్శించి, అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరనున్నారు. రైల్వేశాఖ రూపొందించిన కవచ్ పనితీరును, సనత్‌నగర్ రైల్వేస్టేషన్‌ను పరిశీలించడంతో పాటు శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌‌కు వెళ్లనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version