Warangal: తాత సంవత్సరం రోజు మనవడు మృతి

-

జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో విషాదం జరిగింది. మండల కేంద్రానికి చెందిన పర్వతం సుధాకర్ వృత్తి రీత్యా మడికొండలో నివాసం ఉంటారు. తండ్రి సంవత్సరికం ఉండడంతో తరిగొప్పులకు సుధాకర్ కుటుంబంతో సహా వచ్చారు. సోమవారం పొద్దున సుధాకర్ కొడుకు సమీప పిల్లలతో కలిసి చెరువు దగ్గర ఆడుకుంటూ, ప్రమాదవశాత్తు ఒక్కసారిగా చెరువులో మునిగి మృతి చెందాడు. తాత సంవత్సరం రోజే మనవడి మృతితో విషాదఛాయలు అమలుకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version