మెదక్‌: వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

-

అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చేగుంటలో చోటుచేసుకుంది. మెదక్‌ మండలం నవాబుపేటకు చెందిన నేహా సుల్తానా(22) ను చేగుంటకు చెందిన షేక్‌ ఇబ్రహీంకు రెండేళ్ల క్రితం ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో కానుకలతో పాటు రూ.1లక్ష కట్నం ఇచ్చారు. ఇంకా కట్నం తీసుకు రావాలని అత్తింటి వేధింపులు తాళలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version