
వట్పల్లి మండలం పోతులబోగుడ గ్రామంలో ఆస్తికోసం కన్నతల్లిని చంపాడో కొడుకు. బుధవారం తెల్లవారుజామున మురళి తల్లి మల్లమ్మ(55) ఇంట్లో నిద్రిస్తుండగా గొంతు నులిమి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై దశరథ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మల్లమ్మ అల్లుడు జనార్దన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు