రంగారెడ్డి : ఇద్దరు మహిళలు అదృశ్యం

-

ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. ఈ ఘటనలు షాద్‌నగర్‌ పరిధిలో చోటుచేసుకున్నాయి. శ్రీనగర్‌ కాలనీకి చెందిన పెంటమ్మ గత నెల 14న ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. హైదరాబాద్‌లోని హుషీరాబాద్‌ బాపూజీనగర్‌లో నివాసముండే రాధ గత నెల 22న షాద్‌నగర్‌లోని న్యూసిటీ కాలనీలో ఉండే సోదరి ఇంటికి వచ్చి కనిపించకుండా పోయింది. మహిళల ఆచూకీ తెలిస్తే 08542-252333కు సమాచారం ఇవ్వాలని ఏఎస్సై రాంచంద్రయ్య బుధవారం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version