నేటి నుంచి అగ్నివీరుల నియామకానికి దరఖాస్తులు

-

అగ్నివీరుల నియామకానికి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఆర్మీలో అగ్నివీరుల నియామకానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పెళ్లికాని పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2023-24కు సంబంధించి ఇవాళ్టి (ఫిబ్రవరి 16) నుంచి అగ్నిపథ్‌ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల సమర్పణకు మార్చి 15 తుదిగడువు. అనంతరం ఏప్రిల్‌ 17 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు.అభ్యర్థులు www.joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version